క్రీడాభూమి

మైదానంలో శ్రీనివాసన్, ధోనీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: చాలా కాలం తర్వాత మళ్లీ ఒకే దగ్గర కనిపించిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్, భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఐపీఎల్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు శ్రీనివాసన్‌తోపాటు అతని అల్లుడు గురునాథ్ మెయ్యప్పన్‌పైనా అనుమానాలు తలెత్తాయ. ఆ తర్వాత చోటు చేసుకున్న కీలక పరిణామాల నేపథ్యంలో శ్రీని తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. ఈ ఆరోపణలపైనే రాజస్థాన్ రాయల్స్‌తోపాటు రెండేళ్ల సస్పెన్షన్‌ను ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్ మళ్లీ ఐపీఎల్‌లో రంగ ప్రవేశం చేసింది. శుక్రవారం ప్రాక్టీస్ సెషన్‌కు హాజరైన చెన్నై కెప్టెన్ ధోనీ, ఆ ఫ్రాంచైజీ యజమాని శ్రీని ఇలా మైదానంలో కనిపించారు