క్రీడాభూమి
టీటీలో క్లీన్ స్వీప్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గోల్డ్ కోస్ట్, ఏప్రిల్ 9: కామనె్వల్త్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ టీం ఈవెంట్లో భారత్ క్లీన్ స్వీప్ చేసింది. మహిళల విభాగంలో మహిళల జట్టు ఇది వరకే స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, సోమవారం నాటి పోరులో పురుషుల జట్టు 3-0 తేడాతో నైజీరియాను చిత్తుచేసింది. టీం ఈవెంట్స్లో రెండు టైటిళ్లనూ భారత్ దక్కించుకోవడం విశేషం. పురుషుల ఫైనల్లో మొదటి మ్యాచ్ని బొడె అబియోడన్పై ఆచంట శరత్ కమల్ 4-11, 11-5, 11-4, 11-9 తేడాతో గెల్చుకున్నాడు. అతను అందించిన స్ఫూర్తితో సథియన్ గుణశేఖరన్ 10-12, 11-3, 11-3, 11-4 స్కోరుతో సెగున్ తోరియోలాపై విజయం సాధించి, భారత్కు 2-0 ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం అతను హర్మీత్ దేశాయ్తో కలిసి ఒయాజిడ్ ఒమోటాయో, బొడె అబియోడన్ జోడీపై 11-8, 11-5, 11-3 ఆధిక్యంతో విజయాన్ని అందించాడు. బెస్ట్ఫా ఫైవ్లో వరుసగా మూడు మ్యాచ్లు గెల్చుకోవడంతో భారత్ విజేతగా నిలిచింది. మిగతా రెండు మ్యాచ్రులు రద్దయ్యాయి.
క్లాసిఫికేషన్ పోరులో సింగపూర్ను ఓడించిన ఇంగ్లాండ్కు కాంస్య పతకం లభించింది.