క్రీడాభూమి
మారిన వేదిక
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 11 April 2018
న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: భారత్లో జరగాల్సిన ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్ దుబాయ్కి తరలిపోయింది. 50 ఓవర్ల ఫార్మాట్లో ఈ ఏడాది సెప్టెంబర్ 13 నుంచి 28వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ను అబూదబీలో నిర్వహించాలని ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) తీర్మానించింది. వాస్తవానికి ఈ టోర్నమెంట్కు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండింది. కానీ, టోర్నీలో ఒక జట్టుగా పాల్గొనాల్సిన పాకిస్తాన్ మన దేశంలో ఆడేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేయలేదు. బీసీసీఐకి ఎలాంటి స్పష్టత రాకపోడంతో, ఏసీసీ ప్రత్యామ్నాయంగా దుబాయ్ని వేదికగా ఖాయం చేసింది. భారత్, పాకిస్తాన్ మధ్య చాలాకాలంగా క్రీడా సంబంధాలు లేవన్న విషయం తెలిసిందే.