క్రీడాభూమి

వచ్చే ఐపీఎల్ యూఏఈలో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఏప్రిల్ 25: వచ్చే ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 12వ సీజన్ మ్యాచ్‌లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగే అవకాశం ఉంది. మన దేశంలో వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే, 2019 ఐపీఎల్ మ్యాచ్‌లు వచ్చే ఏడాది మార్చి 29 నుంచి మే 19వరకు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్‌లు, ఎన్నికలు ఒకేసారి జరగడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బహుశా మ్యాచ్‌లు యూఏఈలో జరిగే వీలుందని బీసీసీఐ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందుకు తగిన చర్యలు చేపడతామని వారు పేర్కొంటున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎంతోమందిని ఆకట్టుకుంటుందని, ఇక్కడ పరిస్థితులను బట్టి మార్చే అవకాశం ఉండొచ్చని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పీటీఐకి తెలిపాడు. యూఏఈలో షార్జా, దుబాయ్, అబుదాబి వంటి మూడు వేదికలు మ్యాచ్‌ల నిర్వహణకు అనువుగా ఉంటాయని ఆయన పేర్కొన్నాడు. 2009, 2014లో రెండుసార్లు మన దేశంలో సాధారణ ఎన్నికలు జరిగినపుడు ఐపీఎల్ మ్యాచ్‌ల వేదికలను మార్చారు. 2009లో ఒకసారి మొత్తం టోర్నమెంట్‌నే దక్షిణాఫ్రికాకు, 2014లో ఐపీఎల్ లీగ్‌లో తొలి వంతు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహించారు.