క్రీడాభూమి

వెస్టిండీస్‌కు ప్రపంచకప్ పంజాబ్‌కు ఐపీఎల్ ట్రోఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, ఏప్రిల్ 30: వెస్టిండీస్‌కు ప్రపంచకప్, ప్రస్తుతం భారత్‌లో జరుగతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ టోర్నమెంట్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీని అందించడమే తన ముందున్న ప్రధాన లక్ష్యామని విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ స్పష్టం చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన గేల్ 252 పరుగులు చేసి బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈసారి ఏపీఎల్‌లో వేలానికి ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అతనిని జట్టులోకి తీసుకుంటానని హామీ ఇచ్చిన్నప్పటికీ కోనుగోలు చేయలేదు. వేలంలో మొదట తనను ఎవరూ కొనుగోలు చేయకపోవడం చూసి ఆశ్చర్యానికి గురయ్యానని, ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆడలేకపోతానని అనుకున్నానని, చివరి నిమిషంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తనను కొనుగోలు చేయడంతో అనందం రెట్టింపైందన్నాడు. ఈసారి ఐపీఎల్‌లో మరింత బాగా ఆడతానని తనకు ముందే తెలుసని గేల్ పేర్కొన్నాడు. క్వాలిఫైయింగ్ మ్యాచ్‌ల్లో వెస్టిండీస్ తడబడిన విషయం వాస్తవమేనని, ప్రస్తుతం తమ జట్టు బలంగా ఉందని, ప్రపంచకప్ సాధించడమే తన ముందున్న లక్ష్యమని గేల్ చెప్పాడు.