క్రీడాభూమి

షూటింగ్ చాంపియన్‌షిప్‌కు ‘నిఫా’ దెబ్బ కేరళ నుండి ఢిల్లీకి తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ. మే 25: నేషనల్ షూటింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కేరళలో జరగాల్సిన కుమార్ సురేంద్ర సింగ్ మెమోరియల్ 18వఛాంపియన్ షిప్ టోర్నీని నిఫా వైరస్ ముప్పు పొంచి ఉండడంతో ఢిల్లీకి తరలించారు. చాంపియన్‌షిప్‌లో భాగంగా రైఫిల్, పిస్టోల్ షుటర్స్ షెడ్యూల్‌ను మే 31 నుంచి జూన్ 18వరకు తిరువనంతపురంలో జరగాల్సి ఉంది. జూన్ రెండో వారంలో డా.కర్ణి సింగ్ షుటింగ్ జరగనుంది. అలాగే జూన్ 7 నుంచి 17 వరకు జాతీయస్థాయ సీనియర్, జూనియర్, యూత్ (పురుషులు/మహిళలు) రైఫిల్, షూటింగ్ జరగనుంది. జూన్ 10 నుంచి జరిగే ఈవెంట్లను ఢిల్లీలో నిర్వహించనున్నట్లు ఎన్‌ఆర్‌ఏఐ పేర్కొంది. దీనికి సంబంధించి త్వరలోనే స్టేట్‌మెంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. నిఫా వైరస్ కారణంగానే కుమార్ సురేంద్ర సింగ్ మెమోరియల్ 18వచాంపియన్ షిప్ టోర్నీ, సెలెక్షన్ ట్రయల్ 5ని వాయదా వేస్తున్నట్లు స్పష్టం చేసింది. తర్వలోనే టోర్నీ వివరాలను వెల్లడిస్తామని పేర్కొంది.