క్రీడాభూమి

ధోనీ సేనకు ఘనస్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, మే 28: ఐపీఎల్-11 సీజన్‌లో ట్రోఫీని గెల్చుకుని సోమవారం చెన్నైకి చేరుకున్న కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఘన స్వాగతం లభించింది. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో రెండేళ్లపాటు నిషేధం ఎదుర్కొని ఈసారి ఐపీఎల్‌లో చోటుదక్కించుకున్న తర్వాత ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించి ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను దక్కించుకున్న ధోనీ సేనకు పెద్ద సంఖ్యలో అభిమానులు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. చెన్నై సూపర్ కింగ్స్ అధికారులు ధోనీతోపాటు అతని టీమ్ సభ్యులకు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇక్కడి క్రౌనె ప్లాజా హోటల్‌లో ఐపీఎల్ విజేత టీమ్ సభ్యులందరికీ ఘనంగా సన్మానించారు. ఇక్కడ కూడా వేలాదిమంది అభిమానులు హాజరయ్యారు. బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ ఎన్.శ్రీనివాసన్ ధోనీ టీమ్‌ను అభినందించాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీమ్ సభ్యులతోపాటు హర్బజన్ సింగ్, దక్షిణాఫ్రికా క్రికెటర్ ఇమ్రాన్ తాహీర్ మాట్లాడుతూ చెన్నై అభిమానుల కోసమే మళ్లీ ఐపీఎల్ ట్రోఫీని గెల్చుకున్నామని అన్నారు. టీమ్ అధికారులతోపాటు జట్టు సీఈఓ కె.ఎస్.విశ్వనాథన్ ఐపీఎల్ ట్రోఫీని నగరంలోని తిరుమల తిరుపతి దేవస్థానంలోని సమాచార కేంద్రానికి తీసుకెళ్లి అక్కడ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ఉంచారు. అనంతరం టీమంతా కలసి నగరంలోని ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్రాలు..ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్న తర్వాత సోమవారం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న కెప్టెన్ ధోనీ సేనకు ఘన స్వాగతం పలుకుతున్న అభిమానులు