క్రీడాభూమి

నేడు, రేపు ఆటగాళ్ల కోసం వేలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 29: ప్రో కబడ్డీ ఆరో సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల కొనుగోలు కోసం వేలం బుధ, గురువారాల్లో ఇక్కడ జరుగనుంది. ఆరో ప్రో కబడ్డీ నిర్వహణ కోసం మొత్తం 422 మంది ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు కొనుగోలు చేయనున్నాయి. 422 మంది ఆటగాళ్లలో 87 మంది ఫ్యూచర్ కబడ్డీ హీరోస్ (ఎఫ్‌హెచ్‌ఎస్) కాగా, బంగ్లాదేశ్, ఇరాన్, జపాన్, కెన్యా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మలేషియా, శ్రీలంక వంటి 14 దేశాలకు చెందిన 58 విదేశీ ఆటగాళ్లను కూడా వివిధ ఫ్రాంచైజీలు జట్టులోకి తీసుకోనున్నాయి. మొత్తం 12 ఫ్రాంచైజీలలో ఇప్పటికే తొమ్మిది ఫ్రాంచైజీలు 21 మంది ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నాయి. ఇక మిగిలిన మూడు ఫ్రాంచైజీలు యూపీ యోధ, యూ ముంబా, జైపూర్ పింక్ పాంథర్స్ క్రీడాకారులను బుధ, గురువారాల్లో జరిగే వేలంలో జట్లలోకి తీసుకోనున్నాయి.