క్రీడాభూమి

వంద వికెట్ల మైలురాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత స్పీడ్ స్టార్ ఉమేష్ యాదవ్ టెస్టు క్రికెట్‌లో వంద వికెట్ల మైలురాయని అధిగమించాడు. భారత్ తరఫున టెస్టులో వంద లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసుకున్న భారత ఫాస్ట్ బౌలర్లలో ఎనిమిదో వాడిగా అతను రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించాడు. అఫ్గానిస్తాన్ అరంగేట్రం చేసిన టెస్టు రెండో రోజు ఆటలో అతను రహ్మత్ షా వికెట్‌ను తీసుకోవడం ద్వారా లాంగర్ ఫార్మాట్‌లో వంద వికెట్లను పూర్తి చేశాడు. స్పిన్నర్లను కూడా పరిగణలోకి తీసుకుంటే, వంద టెస్టు వికెట్లను చేరుకున్న 22వ భారత బౌలర్‌గా అతనికి చోటు దక్కింది.

చిత్రం..ఉమేష్ యాదవ్