క్రీడాభూమి

ఐర్లాండ్‌తో టీ-20 కనే్నసిన టీమిండియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డబ్లిన్, జూన్ 26: విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు బుధవారం నుంచి ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ-20 మ్యాచ్‌లలో తలపడనుంది. ఇందులో గెలుపు ద్వారా వచ్చేనెల 12 నుంచి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల సిరీస్‌లోనూ విజయగర్వంతో స్వదేశానికి రావాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగా శనివారంనాడే టీమిండియా జట్టు ఇంగ్లాండ్ చేరుకుని మంగళవారం వరకు ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ చేసింది. జట్టు సభ్యులంతా మూడు విభాగాలుగా విడిపోయి అన్నివిభాగాల్లో రాటుదేలేలా ప్రాక్టీస్ చేశారు. ఇటీవల జరిగిన వనే్డ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టును మట్టికరిపించిన ఇంగ్లాండ్ మంచి జోరు మీద ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా సైతం బలమైన ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌లో సత్తా చూపుతామనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికాలో పర్యటించిన కోహ్లీ సేన తొలిసారిగా బలమైన జట్టుతో ఇపుడు ఐర్లాండ్, ఇంగ్లాండ్ జట్లతో తలపడనుంది.