క్రీడాభూమి
సుందర్, బుమ్రా స్థానంలో కృణాల్, చాహర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 2 July 2018
న్యూఢిల్లీ, జూలై 1: ఈనెల 2 నుంచి మాంచెస్టర్లో ఇంగ్లాండ్తో జరిగే మూడు టీ-20 సిరీస్లలో పాల్గొనే టీమిండియా జట్టులో కొద్దిమార్పులు చేశారు. గాయపడిన వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా స్థానంలో ఆల్రౌండర్ కృణాల్ పాండ్య, మీడియం పేసర్ దీపక్ చాహర్ను ఎంపిక చేశారు. అయితే, ఎడమచేతి వాటం స్పిన్నర్ అక్సర్ పటేల్ను వాషింగ్టన్ సుందర్ స్థానంలో తొలుత తీసుకున్నా, అకస్మాత్తుగా ఆలిండియా సెలక్షన్ కమిటీ కృణాల్ పాండ్య పేరును ప్రతిపాదించడంతో అతనినే ఖరారు చేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ యాక్టింగ్ సెక్రెటరీ అమితాబ్ చౌదరి ధృవీకరించాడు.