క్రీడాభూమి
సిక్స్లు కొడతారని భయపడలేదు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మాంచెస్టర్, జూలై 4: ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ భారీ సిక్సర్లు కొడతారనిగానీ, పరుగుల వర్షం కురిపిస్తారనిగానీ భయపడలేదని, అందుకే స్వేచ్ఛగా బౌలింగ్ చేయగలిగానని భారత యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్తో జరిగిన మొదటి టీ-20లో నాలుగు ఓవర్లలో కేవలం 24 పరుగులిచ్చిన కుల్దీప్ ఐదు వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తూ స్కోరు బోర్డును శరవేగంగా పెంచుతున్న తరుణంలో బౌలింగ్కు దిగిన కుల్దీప్ టీమిండియాను గెలిపించే రీతిలో అద్భుత బౌలింగ్ ఇన్స్పిరేషన్తో రాణించాడు. కుల్దీప్ మీడియాతో మాట్లాడుతూ తాను క్రికెట్ ఆడుతున్నప్పటినుంచి ఒక్కటే నేర్చుకున్నానని, బౌలింగ్కు బరిలోకి దిగినపుడు బ్యాట్స్మన్ ఎలాంటివాడైనా భయపడేది లేదని, స్పిన్ బౌలింగ్తో భయపెట్టడం ఒక్కటే తెలుసునన్నాడు. స్పిన్నర్ అన్నవాడు ఎవరైనా టీ-20 మ్యాచ్లో నాలుగు లేదా ఐదు వికెట్లు తీస్తే దాదాపు ఆ జట్టు విజయం ఖాయమైనట్టేనన్నాడు. భారత బౌలర్లు యుజ్వేంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్ తర్వాత టీ-20లో ఐదు వికెట్లు సాధించిన మూడో బౌలర్గా కుల్దీప్ నిలిచాడు. ఇంగ్లాండ్ గడ్డపై ఐదు వికెట్లు తీసిన రెండో బౌలర్గా కూడా కుల్దీప్ నిలిచాడు.