క్రీడాభూమి

బెల్గాంలో కాదు.. బెంగళూరులో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూలై 23: భారత్-ఎ, దక్షిణాఫిక్రా-ఎ జట్ల మధ్య ఆగస్టు 4నుంచి 7 వరకూ బెల్గాంలో జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ బెంగళూరుకు మారింది. ‘వాతావరణ పరిస్థితుల కారణంగా బెల్గాంలో జరగాల్సిన మ్యాచ్‌ను బెంగళూరుకు మారుస్తున్నాం’ అంటూ కెఎస్‌సిఏ అధికార ప్రతినిధి వినయ్ మృత్యుంజయ వెల్లడించారు. షెడ్యూల్ ప్రకారం రెండో టెస్ట్ ఆగస్టు 10 నుంచి 13 మధ్య బెంగళూరులోనే జరగాల్సి ఉంది. వాతావరణం అనుకూలించక పోవడంతో బెల్గాం పిచ్‌లు సిద్ధం కాలేదని, దీంతో బీసీసీఐ నిర్ణయం మేరకు మ్యాచ్‌ను బెంగళూరుకు మార్చినట్టు వినయ్ పేర్కొన్నారు.