క్రీడాభూమి

కుర్రాళ్లు.. కొట్టేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హంబన్‌టోట, జూలై 27: భారత్ అండర్ 19 కుర్రాళ్లు శ్రీలంక యూత్ జట్టుపై పూర్తి ఆధిపత్యాన్ని సాధించారు. మహీంద్రా రాజపక్సే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం కొనసాగిన రెండో టెస్ట్‌ను ఇన్నింగ్స్ సహా 147 పరుగుల ఆధిక్యంతో ముగించి 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. చివరి రోజు మ్యాచ్‌లో అద్భుత ఫాం ప్రదర్శించిన ఎడమ చేతివాటం స్పిన్నర్ సిద్దార్థ్ దేశాయ్ భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. సిద్ధార్ధ్ 20 ఓవర్లలో 40 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసుకుని భారత్‌కు అజేయ విజయాన్ని అందించాడు. సెకెండ్ ఇన్నింగ్స్ కొనసాగింపుగా 47 పరుగులకు 3 వికెట్ల నష్టంతో శుక్రవారం బ్యాటింగ్ ప్రారంభించిన లంక జట్టు వరుసగా వికెట్లు కోల్పోవడంతో 150 పరుగులతోనే ఇన్నింగ్స్‌ను ముగించాల్సి వచ్చింది. సిద్ధార్ధ్ 4 వికెట్లు తీసుకుంటే, యతిన్ మంగ్వానీ, ఆయుష్ బదోనీలు చెరొక వికెట్ తీసి లంక జట్టును పూర్తిగా కుప్పకూల్చడంతో 2-0తో సిరీస్ భారత్ కైవసమైంది.