క్రీడాభూమి

7నుంచి పీకేఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, సెప్టెంబర్ 17: ఆరో సీజన్ ప్రొ కబడ్డీ లీగ్ (పీకెఎల్) అక్టోబర్ 7 నుంచి మొదలవుతున్నట్టు నిర్వాహక సంస్థ మార్షల్ స్పోర్ట్స్ వెల్లడించింది. ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 5నే ప్రారంభం కావాల్సివున్నా, కారవాన్, స్టేడియంల సౌలభ్యంలాంటి సాంకేతిక ఇబ్బందుల కారణంగా రెండు రోజులు వెనక్కి జరిపినట్టు మీడియా ప్రకటనలో పేర్కొంది. మార్షల్ స్పోర్ట్స్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం టోర్నమెంట్‌లోని తొలి లెగ్ చెన్నైలోనే నిర్వహించనున్నారు. డిసెంబర్ 30, 31 తేదీల్లో ప్లేఆఫ్ మ్యాచ్‌లను కోచిలోను, జనవరి 5న ఫైనల్స్‌ను ముంబయిలో నిర్వహిస్తారు. ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారమవుతాయి.