క్రీడాభూమి

కష్టాల్లో హైదరాబాద్ జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాటియాల, డిసెంబర్ 19: రంజీ ట్రోఫీలో భాగంగా రెండో రౌండ్‌లో పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు కష్టాల్లో పడింది. రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు 5 వికెట్లు కోల్పోయ 30 పరుగులు చేసింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (5), అక్షత్ రెడ్డి (4), శశిధర్ రెడ్డి (4), భవనాక సందీప్ (1), కొల్ల సుమంత్ (2) సింగిల్ డిజిట్‌కే పెవిలియన్‌కు చేరారు. ప్రస్తుతం క్రీజులో హిమాలయ్ అగర్వాల్ (14), చామ మిలింద్ (0) ఉన్నారు. పంజాబ్ బౌలర్లలో అకుల్ పందోవ్‌కు 2, సందీప్ శర్మ, సన్వీర్ సింగ్, మయాంక్ మార్కండే ఒక్కో వికెట్ తీసుకున్నారు. అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 167/4తో మొదటి ఇన్నింగ్‌కు దిగిన పంజాబ్ 6 వికెట్లు కోల్పోయ 443 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. కె ప్టెన్ మణ్‌దీప్ సింగ్ (204, నాటౌట్) డబుల్ సెంచరీకి తోడు, అన్మోల్‌ప్రీత్ సింగ్ (54), అన్మోల్ మల్హోత్రా (80), కరణ్ కైలా (54, నాటౌట్) రాణించారు.
*చిత్రం... మణ్‌దీప్ సింగ్ (204, నాటౌట్)