క్రీడాభూమి

ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కటక్, డిసెంబర్ 23: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన సత్తా ఏమిటో తనకు తాను మాత్రమే నిరూపించుకుంటానని, తానేమిటో ప్రపంచానికి చాటిచెప్పాల్సిన అవసరం ఏమాత్రం లేదని టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అన్నాడు. వెస్టిండీస్‌తో ఆదివారం కటక్‌లో జరిగిన అత్యంత కీలకమైన మూడోది, ఆఖరిది అయిన వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో జడేజా 31 బంతులు ఎదుర్కొని 39 పరుగులతో అజేయంగా నిలిచి ప్రత్యర్థి జట్టు తమ ముందు ఉంచిన 316 పరుగుల భారీ స్కోరును అధిగమించేందుకు క్రమంలో జట్టును విజయతీరాలకు చేర్చడంలో ప్రధాన భూమిక పోషించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తానేమిటో తనకు తానుగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని, కానీ వ్యక్తుల కోసం కాదని అన్నాడు 31 ఏళ్ల జడేజా. ఈ సందర్భంగా ఈ ఆల్‌రౌండర్ మీడియాతో మాట్లాడుతూ ‘ఈ ఏడాది నేను ఎక్కువగా వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడలేదు. అయితే, ఆడిన మ్యాచ్‌లలో ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్, మరోపక్క ఫీల్డింగ్‌లో వచ్చిన అవకాశాలను చక్కగా అందిపుచ్చుకున్నాననే సంతృప్తి మిగిలింది’ అని అన్నాడు. ఈ ఏడాది టీమిండియా ఆడిన మొత్తం 28 వనే్డ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో జడేజా 15 మ్యాచ్‌లలో ఆడాడు. కాగా, వెస్టిండీస్‌తో కటక్‌లో జరిగిన నిర్ణయాత్మక పోరులో తనతోపాటు అత్యంత కీలకంగా రాణించిన శార్దూల్ ఠాకూర్ ఆటతీరును మెచ్చుకున్నాడు.
'చిత్రం... టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా