జాతీయ వార్తలు

ఆ మహేశ్ తేనె పూసిన ‘కత్తి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 8: సినీ రచయిత కత్తి మహేశ్ తేనే పూసిన కత్తి అని శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి దుయ్యబట్టారు. శ్రీ రాముడి గురించి కత్తి మహేశ్ వ్యాఖ్యానించడం అత్యంత దారుణమని, ఈ వ్యాఖ్యలు దేశంలోని హిందువులందరినీ ఎంతో బాధకు గురి చేశాయని పరిపూర్ణనంద స్వామి ఆదివారం విలేఖరుల సమావేశంలో అన్నారు. కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైన శ్రీరాముడిని కత్తి తూలనాడారని, అవమానించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కరే శ్రీ రాముడిని చరిత్రకారుడని ప్రశంసించారని ఆయన తెలిపారు. శ్రీ రాముడిని విమర్శించేందుకు కత్తి మహేశ్‌కు ఎంత ధైర్యం అని ఆయన ప్రశ్నించారు. కత్తి మహేశ్‌పై ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ దీనిని సీరియస్‌గా తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కత్తి మహేశ్ వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం ఉదయం బషీర్‌బాగ్‌లోని భాగ్యలక్ష్మీ దేవాలయంలో శ్రీ రాముడికి పూజలు చేసి, ఆ తర్వాత ఉప్పల్ వరకు పాదయాత్రగా వెళతామని అన్నారు. ఆ తర్వాత యాదగిరి గుట్ట వరకూ పాదయాత్రగా వెళతామని, తన వెంట వేలాది మంది తరలి రానున్నారని ఆయన చెప్పారు. అయినా ప్రనుత్వం వెంటనే చర్యలు తీసుకోని పక్షంలో తాము యాదగిరిగుట్టపైనే కార్యాచరణను ఖరారు చేస్తామని హెచ్చరించారు.