జాతీయ వార్తలు
వృద్ధి లక్ష్యం 4%
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 11 April 2018
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధిని బలోపేతం చేసేందుకు కొన్ని జిల్లాలను పరిపుష్టి చేయాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా విశాఖ, వారణాశి, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని మొదటి దశలో అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రభుత్వం ఎంపిక చేసింది. మంగళవారం కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు నేతృత్వంలో ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేశ ఆర్థిక వృద్ధిలో ఈ నాలుగు జిల్లాలను 4 శాతం వృద్ధి రేటు సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ జిల్లాలోనున్న వనరులు, వౌలిక సాదుపాయాలపై ఆయా జిల్లాల నివేదికలను తయారు చేయాలని ఉన్నతాధికారులకు కేంద్ర మంత్రి ఆదేశాలు జారీ చేశారు.