జాతీయ వార్తలు

మద్యం తాగి పట్టుబడ్డ పైలట్ల పై సస్పెన్షన్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎయిర్‌ ఇండియా, జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ఇద్దరు పైలట్లు తేలింది. దీంతో వారిని 4 సంవత్సరాల పాటు సస్పెండ్‌ చేస్తూ పౌర విమానయాన సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ ఆదేశాలు జారీ చేశారు. వీరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆయా సంస్థలను ఆదేశించారు. ఆగస్టు 3న అబుదాబి నుంచి చెన్నై చేరుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో ఓ పైలట్‌ మద్యం తాగినట్లు తేలింది. ఆగస్టు 10న షార్జా నుంచి కాలికట్‌ చేరుకున్న ఎయిర్‌ఇండియా విమానం పైలట్‌ కూడా మద్యం తాగి పట్టుబడ్డాడు. వారిద్దరినీ సస్పెండ్‌ చేస్తూ.. డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. కాగా.. తమ పైలట్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు జెట్‌ఎయిర్‌వేస్‌ వెల్లడించింది.