జాతీయ వార్తలు

ముగ్గురు వైద్య విద్యార్థినుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: తమిళనాడులోని విల్లుపురంలోని ఎస్‌విఎస్ యోగా, నేచురోపతి వైద్య కళాశాలలో ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం రాష్ట్రంలో కలకలం రేపింది. మనీషా, ప్రియాంక, శరణ్య అనే మెడిసిన్ విద్యార్థినుల మృతదేహాలను ఆదివారం ఉదయం కళాశాల వద్ద బావిలో కనుగొన్నారు. వీరు శనివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. కళాశాలలో వసతుల కోసం పోరాడినా ఫలితం లేనందున తాము ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థినులు సూసైడ్ నోట్‌లో రాసినట్లు తెలుస్తోంది. కళాశాల సిబ్బంది వేధింపుల వల్లే ఈ ఘటన జరిగిందని మృతుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఉద్రిక్తత ఏర్పడినందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కళాశాల వద్ద పోలీసులు మోహరించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.