ఆంధ్రప్రదేశ్‌

కోటి లడ్డూలతో పోటు కార్మికుల రికార్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 7: తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే మే నెలలో రికార్డు స్థాయిలో కోటికి పైగా లడ్డూలు తయారుచేసిన పోటు కార్మికులకు ఒక్కొక్కరికి రూ.2500 ప్రోత్సాహక బహుమానం ఇవ్వాలని టిటిడి ఇఒ సాంబశివరావు నిర్ణయించారు. ఈక్రమంలో కొత్త మైలురాయిని చేరుకున్న పోటు, అదనపు పోటులోని 482 మంది కార్మికులు, 16 మంది సహాయకుల సేవలను ఇఒ ప్రశంసించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం పోటు విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఇఒ మాట్లాడుతూ పోటు కార్మికులు అద్భుతమైన సేవలు అందించారని, భవిష్యత్తులోను ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. పోటు కార్మికుల సేవలకు గుర్తింపుగా మొత్తం 498 మందికి ఒక్కొక్కరికి రూ.2,500 ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. వీరికి ఆరోగ్య బీమా పథకం అమలు చేయడాన్ని పరిశీలించాలని తిరుమల జెఇఓ, ఎఫ్‌ఏ అండ్ సిఏఓకు సూచించారు. పోటు కార్మికుల కోసం నిర్ధిష్టమైన నిబంధనలను రూపొందించి పారదర్శకంగా సొసైటీని ఏర్పాటు చేయాలన్నారు.