తెలంగాణ

హుజూర్‌నగర్‌కు పసుపు దండు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 5: హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి కిర్మణ్మయి విజయానికి కృషి చేసేందుకు విస్తృతంగా ప్రచారం చేయడానికి చురుకైన పార్టీ శ్రేణులను దించేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్నాహాలు ప్రారంభించారని టీ-టీడీపి అధ్యక్షుడు ఎల్. రమణ తెలిపారు. హుజూర్‌నగర్ అసెంబ్లీ పరిధిలోని మండలాల వారిగా పసుపు దండును ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు చర్చించారని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రచారానికి అవసరమైన సామాగ్రి జెండాలు, బ్యానర్లు, వాల్‌పోస్టర్లును తక్షణం హుజూర్‌నగర్‌కు పంపాలని చంద్రబాబు ఆదేశించారని ఆయన తెలిపారు. ఇతర పార్టీల ప్రచారం కంటే టీడీపీ ప్రచార శైలి బాగుండాలని సూచించినట్లు ఆయన తెలిపారు. హుజూర్‌నగర్ అసెంబ్లీలో టీడీపీ సత్తా ఏమిటో టీడీపీ నేతలు, క్యాడర్ చూపించాల్సిన సమయం వచ్చిందన్నారు. సీనియర్ నేతలు సమన్వయంతో క్యాడర్‌ను ప్రచారంలో దింపాలని అన్నారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ రమావత్ నాయక్ నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. విలేఖరుల సమావేశంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యడు రావుల చంద్రశేర్ రెడ్డి, బక్కని నర్సింహులు, కొత్తకోట దయాకర్‌రెడ్డి, అరవింద్ కుమార్‌గౌడ్, సామ భూపాల్‌రెడ్డి, నన్నూరి నర్సిరెడ్డి పాల్గొన్నారు.