అనంతపురం

యువకుని అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరిటౌన్,జనవరి 22: పట్టణ శివార్లలోని మూర్తిపల్లి పొలాల్లో అరుణ్‌కుమార్ (17) అనే యువకుడు శుక్రవారం అనుమానాస్పదంగా ఉరివేసుకొని మృతి చెందాడు. అరుణ్‌కుమార్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాడు. చిన్నతనం నుంచే పట్టణంలోని మారుతీ నగర్‌లో వున్న గణేష్ మిఠాయిల తయారీ కేంద్రంలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం నుంచి అరుణ్‌కుమార్ కనిపించలేదు. మూర్తిపల్లి పొలాల్లో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు చేసుకున్నట్లు మూర్తి పల్లి గ్రామస్థులు మిఠాయి కేంద్రం యజమానికి సమాచారం ఇచ్చారు. ఆ యజమాని పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై సాగర్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కాగా అరుణ్‌కుమార్ అత్మహత్య చేసుకోవాల్సిన అవసరము అరుణ్‌కుమార్‌కు లేదని, ఎవరైనా హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించి వుంటారన్న అరుణ్‌కుమార్ మేనత్త మల్లిక ఆరోపించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.