జాతీయ వార్తలు
అత్యాచారం, హత్య కేసులో దోషికి ఉరిశిక్ష
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 12 April 2016
జార్ఖండ్: ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆ తర్వాత గొడ్డలితో నరికి చంపిన ఘటనలో దోషికి మరణశిక్షను విధిస్తూ జార్ఖండ్లోని గిరిథ్ జిల్లా కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. 2011లో మధురయాదవ్ అనే వ్యక్తి మామిడిపండ్లు ఇస్తానని చెప్పి ఏడేళ్ల బాలికను అడవిలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఆమె తలను గొడ్డలితో నరికేశాడు. అత్యాచారం, హత్య అభియోగాలకు సంబంధించి సాక్ష్యాలు సరిపోవడంతో దోషికి మరణశిక్ష వేస్తూ జిల్లా న్యాయమూర్తి తీర్పు ప్రకటించారు. మృతదేహాన్ని దాచిపెట్టేందుకు సహకరించిన మధుర యాదవ్ తండ్రి బికారి యాదవ్కు రెండేళ్ల జైలుశిక్షను విధించారు.