జాతీయ వార్తలు
వరద సహాయ చర్యలకు 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 23 August 2016
దిల్లీ: ఉత్తరప్రదేశ్, బిహార్లోని వరద ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టేందుకు 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. సత్వర చర్యలకై ఒడిశా నుంచి 5 బృందాలను యూపీకి, పంజాబ్ నుంచి మరో 5 బృందాలను బిహార్కి తరలించినట్లు ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ ఓపీ సింగ్ తెలిపారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోనూ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయ సహకారాలను అందిస్తున్నట్లు సింగ్ పేర్కొన్నారు. హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, రాజస్థాన్ల ముఖ్యమంత్రులతో ఫోన్లో సంభాషిస్తూ కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.