జాతీయ వార్తలు

ప్రముఖ నటి విజయనిర్మల కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. చికిత్స తీసుకుంటున్న ఆమె బుధవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందారు. నటిగా, దర్శకురాలిగా పేరొందిన విజయనిర్మల మహిళా దర్శకురాలిగా ఖ్యాతి నొందారు. ఆమె దాదాపు 44 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇన్ని చిత్రాలకు ఓ మహిళ దర్శకత్వం వహించటం రికార్డ్. అందుకే ఆమె పేరు గిన్నిస్ రికార్డుల్లో చోటుచేసుకుంది. ఆమె మృతిచెందే సమయంలో పక్కన భర్త కృష్ణ, కుమారుడు నరేష్ ఉన్నారు. 1946 ఫిబ్రవరి 26న చెన్నైలో జన్మించారు. తండ్రిది చెన్నై. తల్లి గుంటూరు జిల్లా నరసరావుపేట. ఏడేళ్ల వయసులోనే విజయనిర్మల బాలనటిగా చిత్రరంగ ప్రవేశం చేశారు. మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన తరువాత నటుడు కృష్ణను తిరుపతిలో వివాహం చేసుకున్నారు. 1950లో మత్స్యరేఖ అనే తమిళ చిత్రం ద్వారా బాలనటిగా ప్రవేశించారు. తెలుగులో రంగులరాట్నం ద్వారా కథనాయికిగా చిత్రరంగ ప్రవేశం చేశారు. అక్కడి నుంచి దాదాపు 200 చిత్రాల్లో నటించారు. ఆమెకు నందిపురస్కారం, అత్యున్నత రఘుపతి వెంకటరత్నం అవార్డు సైతం దక్కాయి. తెలుగు, తమిళ, మళయాళం తదితర భాషల్లో 200 సినిమాల్లో నటించిన విజయనిర్మల పూల రంగడు, సాక్షి, అసాధ్యుడు, బంగారు గాజులు, బొమ్మా బొరుసు, మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, పాడిపంటలు, అల్లూరి సీతరామరాజు, తాతామనవడు, మీనా, మారిన మనిషి, కురుక్షేత్రం, పిన్నీ తదితర చిత్రాల్లో నటించారు. ‘పెళ్లి కానుక’ సీరియల్‌తో బుల్లితెర ప్రవేశం చేసి అలరించారు.
1971లో మీనా చిత్రానికి దర్శకత్వం బాధ్యతలు వహించిన విజయనిర్మల అప్పటి నుంచి 2009 వరకు దాదాపు 44 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తన సొంత నిర్మాణ సంస్థ అయిన విజయకృష్ణ పతాకంపైనే దాదాపు 15 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆమె దర్శకత్వం వహించిన చిత్రాలలో దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ, ప్రజల మనిషి, మొగుడు పెళ్లాల దొంగాట, పుట్టింటి గౌరవం, రెండు కుటుంబాల కథ వంటి ప్రముఖమైనవి.