జాతీయ వార్తలు
విద్వేషాలు రెచ్చగొట్టే వెబ్సైట్లపై కఠిన చర్యలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 19 July 2016
ఢిల్లీ: గత మూడేళ్ళలో మతపరమైన విద్వేష కేసులు పెరిగినట్లు, విద్వేషాలు, మత కలహాలు రెచ్చగొట్టే వెబ్సైట్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం లోక్ సభలో తెలిపారు. దాద్రి వంటి ఘటనలపై కొన్ని వెబ్ సైట్లు, సోషల్ మీడియాలో విస్త్రృత ప్రచారం జరిగిందన్నారు. విద్వేషాలు, మత కలహాలు రెచ్చగొట్టే వ్యక్తులతో పాటు వెబ్సైట్లు, సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో ఇలాంటి కేసుల సంఖ్య పెరిగినట్లు తెలిపారు. అల్ ఖైదా, ఐఎస్ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలు సామాజిక మాధ్యమాల ద్వారా యువతను తమ వైపు ఆకట్టుకుని నియామకాలు చేపడుతున్నాయని వివరించారు.