పశ్చిమగోదావరి

ప్రభుత్వ వైద్య కళాశాల ఇచ్చి తీరాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం(టౌన్), జూన్ 6: ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరుకు నిధుల సమస్య ప్రతిబంధకంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేసిన ప్రకటనను లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీశెట్టి బాబ్జీ తీవ్రంగా ఖండించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెనుకబడిన ప్రజలు నిరసించే విజయనగరం జిల్లా ప్రజల గోడు మంత్రికి ఎందుకు వినిపించటంలేదో అర్థం కావటంలేదని ఆవేదన వ్యక్తంచేసారు. ఇక్కడ ప్రభుత్వ వైద్య కళాశాల అవసరం ఉందని అందుకే తాము ప్రజల తరపున ఆందోళన చేస్తున్నామని తెలిపారు. మాన్సాస్ సంస్థకు వైద్య కళాశాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించటంలేదని చెబుతూ ప్రభుత్వ పరంగా వైద్య కళాశాల ఏర్పాటును ప్రజలు కోరుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చినహామీ నిలబెట్టుకోవడానికి 300 కోట్లు మంజూరు చేయడం పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. ప్రభుత్వం వైద్య కళాశాలలను మంజూరు చేసేవరకు పోరాడతామని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు చిన్నారావు, భానుమూర్తి, భాస్కర్ పాల్గొన్నారు.