అనంతపురం

స్కార్పియో బోల్తా...ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బత్తలపల్లి, జనవరి 22: వ్యక్తిగత పనిపై ధర్మవరం వెళ్ళి తిరుగు ప్రయాణంలో స్వగ్రామామైన దాడితోటకు వెళ్తున్న స్కార్పియో వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో మాజీ మంత్రి తనయుడుతో పాటు నాగిరెడ్డి అనుచరుడు అక్కడికక్కడే మృతిచెందగా మరో అనుచరునికి తీవ్రగాయాలపాలైన సంఘటన శుక్రవారం బత్తలపల్లి మండలంలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయిన గరుడమ్మగారి నాగిరెడ్డి కుమారుడు గరుడమ్మగారి సతీష్‌రెడ్డి తన స్కార్పియో వాహనంలో ట్రెజరీలో పనిమీద ధర్మవరం వచ్చి అక్కడ పని ముగిసిన తర్వాత బత్తలపల్లిలో భోజనం చేసి స్వగ్రామమైన తాడిమర్రి మండలం దాడితోట గ్రామానికి బయలుదేరారు. వాహనం మండలంలోని బత్తలపల్లి, తాడిపత్రి ప్రధాన రహదారిలో వెంకటగారిపల్లి సమీపాన గల మరువగొడ్డు వాగు వద్ద మిట్ట ఎక్కే సమయంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోతు వేగాన్ని అదుపు చేయలేక సడన్‌గా బ్రేకు వేయడంతో వాహనం అదుపుతప్పి రహదారిపైనే బోల్తా పడి సుమారు 40అడుగులు పల్టీలు కొట్టడం వల్ల మాజీ మంత్రి తనయుడు సతీష్‌రెడ్డి(38)తో పాటు రామకృష్ణారెడ్డి(60) అక్కడికక్కడే మృతిచెందగా, చంద్రశేఖర్‌రెడ్డి తీవ్ర గాయాపడ్డాడు. తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్‌రెడ్డిని స్థానిక ఆర్‌డిటిలో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ హేమంత్‌కుమార్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్ళి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాడు. వెంటనే ధర్మవరం డిఎస్‌పి వేణుగోపాల్, సిఐ మురళికృష్ణలు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రమాద ఘటనకు కారణాలు అడిగి తెలుసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మాజీ మంత్రి తనయుడు మృతిచెందిన వార్త తెలుసుకున్న బత్తలపల్లి, తాడిమర్రి మండలాల నుండి ముఖ్యంగా దాడితోటకు చెందిన గ్రామస్థులు, నాగిరెడ్డి అనుచరులు భారీగా తరలిరావడంతో రహదారి కిక్కిరిసి పోయింది. మృతిచెందిన సతీష్‌రెడ్డికి తల్లిదండ్రులతో పాటు ఒక సోదరి వుండగా రామకృష్ణారెడ్డికి భార్యతో పాటు కుమార్తె, కుమారుడు వున్నారు.
విలపించిన నాగిరెడ్డి...
వృద్ధాప్యంతో ఆసరాగా నిలుస్తాడనుకున్న ఒక్కగానొక్క కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించడంతో అనారోగ్యంగా వున్నా ప్రమాద స్థలానికి తన సతీమణి సర్పంచ్ సునీతతో కలిసి మాజీ మంత్రి నాగిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం వద్ద విలపించడం పలువురిని కలచివేసింది. తనయుడు కూడా అనారోగ్యంతో వుండి దాతల సహాయంతో ఆరోగ్యం మెరుగుపడుతున్న సమయంలో తనయుడు మృత్యువాత పడడం, ఆ కుటుంబంతో పాటు గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి.
పలువురి పరామర్శ...
మాజీ మంత్రి గరుడమ్మగారి నాగిరెడ్డి కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలుసుకున్న పలువురు సంఘటనా స్థలం చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. బత్తలపల్లి ఎంపిపి కోటి సూర్యప్రకాష్‌బాబు, సింగిల్ విండో మాజీ అధ్యక్షులు పురుషోత్తంచౌదరి, బత్తలపల్లి తహశీల్దార్ సురేష్‌బాబు, తాడిమర్రి టిడిపి నేత రఘురాం చౌదరి, చిగిచెర్ల శివారెడ్డి, నెట్టెం రామకృష్ణ, నెట్టెం కృష్ణమనాయుడు, పలువురు దేశం నేతలు, వైకాపా నేతలు పరామర్శించిన వారిలో వున్నారు.