జాతీయ వార్తలు

రాష్ట్రాల అభివృద్ధే దేశాభివృద్ధి: వెంకయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచి, మే 16: దేశాభివృద్ధి రాష్ట్రాల అభివృద్ధిపై ఆధారపడి ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టన అనేక పథకాలు, ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వ అధికారులతో కలిసి ఇక్కడికి వచ్చిన వెంకయ్యనాయుడు మంగళవారం విలేఖరులతో మాట్లాడారు. కేంద్ర పథకాల అమలులో ఏవయినా సమస్యలు ఎదురయిన పక్షంలో వాటిని పరిష్కరించడానికి రాష్ట్రాల్లో పర్యటించి, స్థానిక అధికారులను కలుస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రధాని మోదీ మూడు మంత్రాలయిన రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్‌లను ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ప్రాజెక్టులను సమీక్షించడానికి తాను ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలు, హర్యానా, కర్నాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించానని, వచ్చేవారం రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లకు వెళ్తున్నట్లు చెప్పారు. జార్ఖండ్‌లో అమృత్, స్మార్ట్ సిటీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, స్వచ్ఛ్భారత్ మిషన్ ప్రాజెక్టులను సమీక్షించిన మంత్రి రాష్ట్రానికి విడిగా ఒక దూరదర్శన్ చానల్‌ను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

చిత్రం..కేంద్ర మంత్రి వెంకయ్యకు స్వాగతం పలుకుతున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘువర్ దాస్