జాతీయ వార్తలు

పరిశ్రమలతోపాటు గ్రామాలకూ కొత్తవెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయ్‌పూర్, జూన్ 9: పరిశ్రమలతో సమానస్థాయిలో గ్రామాలనూ అభివృద్ధి చేయవచ్చని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రుజువు చేసిందని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఈ మూడేళ్ల పాలనలో మచ్చలేని పారదర్శక పాలన అందించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కుతుందని అన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ‘మోడీ ఫెస్ట్’లో అమిత్ షా పాల్గొన్నారు. గత ప్రభుత్వాలన్నీ కేవలం పరిశ్రమలనో లేక రైతుల అభివృద్ధినో ప్రధాన అజెండాగా చేసుకునేవని, కాని బిజెపి ప్రభుత్వం వచ్చాక మాత్రమే పారిశ్రామికంగా, వ్యావసాయకంగా సమానస్థాయిలో అభివృద్ధి సాధించడం జరుగుతోందని వివరించారు. ఈ మూడేళ్ల పాలనలో ఒక్క అవినీతి జరిగిన దాఖలాలు లేవని ఇది తమ పారదర్శకతకు నిదర్శనమని అన్నా రు. పేదలకు గ్యాస్ సిలిండర్‌లను అందించడంతోపాటు ప్రతి ఇంటికీ టాయ్‌లెట్స్ మం జూరు చేసిందని, పేదలందరికీ బ్యాంకు ఖాతాలను అందించిన ఘనతా తమ పార్టీదేనని అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలన్నదే ప్రధాని మోదీ ఆశయమని, ఆ ఆశయమే ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారత్ ముందు వరుసలో నిలబెట్టిందని అన్నారు.

చిత్రం.. రాయ్‌పూర్‌లో శుక్రవారం ‘మోదీ ఫెస్ట్’ను ప్రారంభిస్తున్న అమిత్ షా