AADIVAVRAM - Others
దాతృత్వం (కథాసాగరం)
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రాజులందరూ చెడ్డవాళ్లని అందర్నీ ఒకే గాట కట్టెయ్యలేం. కొందరు దుర్మార్గులుంటారు. కొందరు మంచివాళ్లుంటారు. ప్రజల్ని పట్టించుకోని స్వార్థపరులుంటారు. అధికారం చెలాయించే అహంకారులుంటారు, ప్రజల కష్టసుఖాల్ని పట్టించుకునే పాలకులు ఉంటారు. ఆదుకునే ధర్మప్రభువులూ ఉంటారు.
ఒక ఔదార్యవంతుడయిన రాజుకు వారసత్వంగా లెక్కలేనంత ఐశ్వర్యం వచ్చింది. అతను దయాశీలి. చేతికి ఎముకలేని దానశీలి. దేశమంతా తిరిగి రైతుల కష్టసుఖాల్ని తెలుసుకుని వాళ్లను వీలయినంతగా ఆదుకునేవాడు. తన సైనికుల బాగోగులు చూసేవాడు.
సాంబ్రాణి పొగ నలుదిక్కులా వ్యాపించినట్లు దేశమంతా అతని మంచితనం మంచి గంధంలా వాసనలు చిమ్మింది.
నిజానికి వ్యక్తి గొప్పవాడు కావాలంటే మనసులో ఆర్ద్రత ఉండాలి. ఔదార్యముండాలి. వాటికి ఎప్పుడు గుర్తింపు వస్తాయంటే ఇతరుల్ని ఆదుకున్నప్పుడే గింజలు పొలంలో వేయందే మొలకెత్తవు కదా!
రాజకుమారునికి ఒక మిత్రుడుండేవాడు. అతను కూడా రాజవంశీకుడే. రాజకుమారుడు విచ్చలవిడిగా ధనం వెదజల్లడం అతనికి ఇష్టం లేదు. సమయం చూసి ఆ ప్రయత్నం మానిపించాలనుకున్నాడు. ఒకరోజు ఏకాంతంలో ‘మిత్రమా! ఇప్పుడు నువ్వు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్న ధనం మీ పూర్వీకులయిన రాజులు కూడబెట్టింది. రాజ ధనాగారం ఉన్నది రాజు బలాన్ని తెలపడానికి. ఖజానా ఉన్నది ఖాళీ చెయ్యడానికి కాదు. కొంత ఔదార్యాన్ని అదుపు చేసుకో. నువ్వు ధనహీనుడవయితే నీ శత్రువులు బలపడతారు. నువ్వు బలహీనుడవుతావు. నువ్వు బలహీనపడితే ప్రమాదాల్ని కొని తెచ్చుకున్నవాడివవుతావు’ అన్నాడు.
మిత్రుడు రాజకుమారుని మేలుకోరి తానా మాటలు చెప్పానని భావించాడు. కానీ ఆ మాటలకు రాజకుమారుడికి ఆగ్రహం వచ్చింది.
‘మిత్రమా! భగవంతుడు ఇంత ఐశ్వర్యాన్ని నాకు ఇచ్చింది నేను దాచిపెట్టుకోవడానికి కాదు. లోభిలా జీవించడానికి కాదు. ఈ ధనమంతా ప్రజలది. ప్రజలకు ఉపయోగపడని ధనం ఉంటే లాభం లేదు. అట్లా అని కేవలం నా స్వార్థానికి ధనాన్ని ఉపయోగించుకోవడం దానవత్వమవుతుంది. ఆ ధనం నేనూ అనుభవించాలి, ఇతరులకూ పెట్టాలి. అప్పుడే నా జీవితానికి సార్థకత చేకూరుతుంది’ అన్నాడు.
రాజకుమారుని మాటలు మిత్రుని అభిప్రాయాన్ని మారేలా చేశాయి. మిత్రుడు క్షమాపణలు కోరాడు.
రాజకుమారుడు ‘మిత్రమా! ఈ ధనం మనం పోతే మనతో రాదు. మనం పోయినా మంచి పనులు చేస్తే ప్రజలు మనల్ని గుర్తుంచుకుంటారు’ అన్నాడు.
మిత్రుడు ఉన్నతుడయిన రాజకుమారుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు.