క్రీడాభూమి
పురుషులు కూడా క్రికెట్ ఆడేవారా!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 28 July 2017
న్యూఢిల్లీ, జూలై 27: భారత క్రికెట్ అంటే మహిళల జట్టే గుర్తుకొచ్చే రోజులు త్వరలోనే రానున్నాయని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు అన్నారు. అసలు పురుషులు క్రికెట్ ఆడేవారా అనే ప్రశ్న భవిష్యత్తులో ఉదయించినా ఆశ్చర్యం లేదని చమత్కరించారు. ఇంగ్లాండ్లో జరిగిన ప్రపంచ కప్ చాంపియన్షిప్లో మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత్ ద్వితీయ స్థానంలో నిలిచినప్పటికీ, దేశ ప్రజల మన్ననలు అందుకుందని తెలిపారు. నిన్నమొన్నటి వరకూ క్రికెట్ అంటే పురుషులకు మాత్రమే పరిమితమనే అభిప్రాయం ఉండేదని, ఇప్పడు మహిళా క్రికెటర్లు కూడా గుర్తింపు పొందుతున్నారని తెలిపారు. మహిళల క్రికెట్ చాలా కొద్ది కాలంలోనే పురుషుల క్రికెట్ను అధిగమించడం ఖాయమని అన్నారు.