క్రీడాభూమి

న్యూజిలాండ్ ఓపెన్ బాడ్మింటన్‌లో ముగిసిన భారత్ పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్లాండ్, ఆగస్టు 4: న్యూజిలాండ్ ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో నాలుగో సీడ్ హెచ్‌ఎస్ ప్రణయ్, సౌరభ్ వర్మ తమతమ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌ల్లో పరాజయాలను ఎదుర్కోవడంతో భారత్ పోరాటానికి తెరపడింది. ప్రణయ్ 10-21, 22-20, 21-23 తేడాతో 11వ సీడ్ లిన్ యూ సీన్ చేతిలో ఓటమిపాలయ్యాడు. సౌరభ్‌ను లీ చుక్ ఇయూ (హాంకాంగ్) 21-19, 21-16 తేడాతో ఓడించాడు. భారత్ తరఫున బరిలోకి దిగిన మిగతా వారంతా ఇప్పటికే ఇంటిదారి పట్టగా, క్వార్టర్ ఫైనల్స్ వరకూ చేరుకున్న ప్రణయ్, సౌరభ్ కూడా పరాజయాలను చవిచూడడంతో, టోర్నీ నుంచి భారత్ నిష్క్రమణ పర్వం పూర్తయింది.