క్రీడాభూమి

దబాంగ్ ఢిల్లీపై యు ముంబా గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగపూర్, ఆగస్టు 5: ప్రో కబడ్డీ లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మొదటి మాయచ్‌లో దబాంగ్ ఢిల్లీని యు ముంబా జట్టు 14 పాయింట్ల తేడాతో ఓడించింది. షబీర్ బప్పు, అనూప్ కుమార్ చెరి ఏడు పాయింట్లు సాధించడంతో ఆ జట్టు 36 పాయింట్లను అందుకోగలిగింది. సురేష్ కుమార్ నాలుగు పాయింట్లతో రాణించాడు. కాగా, దబాంగ్ ఢిల్లీ 22 పాయింట్లకు పరిమితమైంది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన స్టార్ ఆటగాడు మిరాజ్ షేక్ ఏడు పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నీలేష్ షిండే ఐదు పాయింట్లు చేశాడు. మిగతా వారు విఫలం కావడంతో దబాంగ్ ఢిల్లీకి ఓటమి తప్పలేదు.
మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌పై యుపి యోద్ధ ఎనిమిది పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఈ జట్టు 29 పాయింట్లు చేయగా, బెంగళూరు 21 పాయింట్లు సంపాదించింది.