క్రీడాభూమి

చైనా ఓపెన్ బాడ్మింటన్ రెండో రౌండ్‌కు సైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫుజో, నవంబర్ 15: చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో భారత జాతీయ చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్ వన్ సైనా నెహ్వాల్ రెండో రౌండ్ చేరింది. మొదటి రౌండ్‌లో ఆమె బీవన్ జాంగ్‌ను 21-12, 21-13 తేడాతో ఓడించింది. ఈ రౌండ్‌ను సునాయాసంగానే ముగించినప్పటికీ, రెండో రౌండ్‌లో ఆమెకు జపాన్ క్రీడాకారిణి అకానే యమాగూచీ నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. కాగా, పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ కూడా ముందంజ వేశాడు. అతను మొదటి రౌండ్‌లో లీ డాంగ్ కుయెన్‌ను 16-21, 21-16, 21-19 ఆధిక్యంతో విజయం సాధించాడు. అయతే, సమీర్ వర్మ మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించాడు. బ్రిస్ లెవెరెజ్ చేతిలో అతను 14-21, 21-15, 11-21 తేడాతో ఓటమిపాలయ్యాడు.