కర్నూల్

ముస్లింలకు అండగా ఉంటా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, జూన్ 17: ముస్లింలకు ఎల్లప్పుడు అండగా ఉంటానని కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు బుట్టారేణుక అన్నారు. ఆదోనిలో ఆదివారం రోజు ఖాజీ అల్త్ఫా హుసేన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బుట్టారేణుక మాట్లాడుతూ ఎంపీ నిధుల నుంచి ముస్లిం, మైనార్టీల అభివృద్ధి కోసం రూ.కోటి రూపాయాలు కేటాయించానని ఆ నిధులను ఇంత వరకు ఉపయోగించుకోవటం లేదని ఆమె అన్నారు. ఈసందర్భంగా ముస్లిం నాయకులు మాట్లాడుతూ తమకు షాధికానాకు స్థలం చూపడం లేదన్నారు. అలాగే మసీదు ఆధ్వర్యంలో నడిచే పాఠశాలకు సహాయం చేయాలని కోరారు. ముస్లింలు సమస్యలను తీర్చడానికి తాను కృషి చేస్తానని , వారు వెంటనే కోటి రూపాయాలను ఉపయోగించుకోవాలని కోరారు. ఏ సమస్య ఉన్న తాను తీర్చడానికి సిద్దంగా ఉన్నాని ఆమె తెలిపారు.
ఆర్డీఎస్‌ను సందర్శించిన తిక్కారెడ్డి
కోసిగి, జూన్ 17: మూడు రాష్ట్రాల మధ్య నిర్మించిన ఆర్డీఎస్ ఆనకట్టను మంత్రాలయం టీడీపీ ఇన్‌ఛార్జి తిక్కారెడ్డి ఆదివారం సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్డీఎస్ ఆనకట్టు నుంచి దిగువున పారే నీళ్లను వృధాగా పోకుండా నియోజకవర్గంలో ఉన్న ప్రాజెక్టులు నింపుతామని ఆయన అన్నారు. ఈనీటిని పులికనుమ ప్రాజెక్టులకు పంపింగ్ చేసి ఆగస్టు నెలలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు.