జాతీయ వార్తలు
ఈయూ సాయం రూ. 1.53 కోట్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 24 August 2018
న్యూఢిల్లీ, ఆగస్టు 23: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళను ఆదుకోడానికి యురోపియన్ యూనియన్ (ఈయూ) ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రజల తక్షణ అవసరాల నిమిత్తం ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీకి 190,000 యూరోలు (రూ.1.53 కోట్లు) ఇవ్వనున్నట్టు ఈయూ ప్రకటించింది. కష్టాల్లో ఉన్న కేరళను మానవతా దృక్పధంతో ఆదుకుంటామని 28 దేశాల ఈయూ కూటమి స్పష్టం చేసిం ది. తక్షణ సాయంగా ఇండియన్ రెడ్క్రాస్ కు రూ.1.53 కోట్లు ఇస్తామని ఈయూ ఓ ప్రకటనలో తెలిపింది. నిత్యావసర సరుకులు, వంట సామగ్రి, టార్పాలిన్లు ఆ నిధులతో సమకూర్చాలని స్పష్టం చేసింది.