హైదరాబాద్

రేవంత్ ఇక మాయమాటలు కట్టిపెట్టు: పట్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇన్నాళ్లు మాయమాటలతో పబ్బం గడిపావు.. ఇక ఆటలు సాగవు.. ప్రజలు అంతా గమనిస్తున్నారు.. రానున్న ఎన్నికల్లో తగిన గుణపాటం చెబుతారని టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని ఎనే్కపల్లి, రేగడి మైలారంతో పాటు గ్రామ పంచాయతి పరిధిలోని గిరిజన తండాలు, నాగిరెడ్డిపల్లి, చౌదర్‌పల్లి, దుద్యాల గ్రామాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డితో కలిసి పాల్గోని ప్రసంగించారు. ఆయా గ్రామాల్లో పార్టీ జెండాను ఎగురవేశారు. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ కొడంగల్ ప్రజలు రెండు పర్యాయాలు గెలిపించినా నియోజక అభివృద్ధి పట్టించుకోకుండా హైదరాబాద్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మళ్ల్లీ ఏ ముఖం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడుగుతావని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి కొడంగల్ ప్రాంత ప్రజల పరువుతీశావని దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన నరేందర్ రెడ్డి సమక్షంలో ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు గులాబీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. నరేందర్ రెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు విష్ణువర్దన్ రెడ్డి, పార్టీ నాయకులు మహేందర్ రెడ్డి, కోట్ల యాదగిరి, రమణా రెడ్డి, నారాయణ రెడ్డి, రామకృష్ణయాదవ్, ప్రమీలమ్మ, సోంనాథ్ పాల్గొన్నారు.