క్రీడాభూమి
యువరాజ్సింగ్ మ్యాచ్ విన్నర్ : రోహిత్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ముంబై, మార్చి 19: ఈసారి ఐపిఎల్లో ముంబై ఇండి యన్స్ తరఫున బరిలోకి దిగుతున్న ఆల్రౌండర్ యువ రాజ్ సింగ్పైనే అందరి దృష్టి పడిందని, అతడు తప్పకుం డా మ్యాచ్ విన్నరేనని ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొ న్నాడు. ముంబై ఇండియన్స్ జట్టు మెంటర్ జహీర్ఖాన్తో కలిసి రోహిత్ మీడియాతో మాట్లాడాడు. గత ఐపీఎల్లో తను ఏ స్థానంలో దిగాలో తెలియక ఇబ్బంది పడ్డానని, అ ది జట్టుపై ప్రభావం చూపడంతో ప్లే ఆఫ్ దశలోనే వెనుది రగాల్సి వచ్చిందని గుర్తుచేశాడు. అయతే ఈసారి మాత్రం తను ఓపెనర్గానే బ్యాటింగ్కు దిగనున్నట్లు స్పష్టం చేశాడు. జహీర్ఖాన్ మాట్లాడుతూ కొందరు ఆటగాళ్లు కొ న్నిసార్లు ఐపీఎల్లో అమ్ముడుపోరని, కానీ వారి అను భవంతో రెండోసారి వేలంలో తప్పకుండా అమ్ముడుపో తారని చెప్పాడు. ఇదే తరహాలో మాకు యువరాజ్సింగ్ దొరికాడని, అతడి అనుభవం తప్పకుండా జట్టుకు ఉప యోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
చిత్రం.. మీడియాతో మాట్లాడుతున్న జహీర్, రోహిత్