తెలంగాణ

బీజేపీలో చేరిన మాజీ సీఎం నాదేండ్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు నెల రోజులు సీఎంగా పనిచేసిన మాజీ సీఎం నాదేండ్ల భాస్కరరావు బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శంషాబాద్‌లో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా పలువురు పార్టీలో చేరారు. బీజేపీలో చేరినవారిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ రామ్మోహన్‌రెడ్డి, మెదక్‌ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, నిర్మాత బెల్లంకొండ రమేశ్‌, రామగుండం డిప్యూటీ మేయర్‌ ఎం సత్యప్రసాద్‌, భద్రాద్రి కొత్తగూడెం తెదేపా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, బుక్కా వేణుగోపాల్‌, సిద్ధా వెంకటేశ్వరరావు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ చంద్రవదన్‌, మాజీ ఎంపీ చాడా సురేశ్‌రెడ్డి తదితరులు ఉన్నారు.