మెదక్

ఘనంగా శ్రీరామ యజ్ఞం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దౌల్తాబాద్, ఏప్రిల్ 17 : దౌల్తాబాద్ మండలం మహ్మద్‌షాపూర్ గ్రామంలో ఆదివారం ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. శ్రీరామ యజ్ఞాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. అనంతరం పల్లకిసేవ, 108 కుండాలతో యజ్ఞం చేశారు. ఈ సందర్భంగా హనుమాన్ స్వాముల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి విహెచ్‌పి జాతీయ సహకార్యదర్శి గుమ్మల్ల సత్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ధర్మానికి కీడు తలపెట్టేవారు కొందరు హిందువుల పేరుతో చలామణి అవుతున్నారన్నారు. హిందువులంతా అప్రమత్తంగా, ఐక్యంగా ఉండి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం పార్లమెంట్‌లో చట్టం తెచ్చేలా ముందుకు సాగాలని సూచించారు. ఆధ్యాత్మికతతోనే మనసు ప్రశాంతంగా ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ దైవభక్తిని పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విహెచ్‌పి నాయకులు విఎస్ మూర్తి, వనపర్తి వెంకటేశం, బాల్‌రెడ్డి, బజరంగ్‌దళ్ నాయకులు దనుంజయ్, మల్లేషం, గోవింద్, ఎంపిపి మంగమ్మ, మాజీ సర్పంచ్ మల్లేషం తదితరులు పాల్గొన్నారు.