తెలంగాణ
అంతర్జాతీయ కరాటేలో రాణించిన రాష్ట్ర క్రీడాకారులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 7 September 2019
హైదరాబాద్, సెప్టెంబర్ 6: మలేషియాలో జరిగిన తొమ్మిదో అంతర్జాతీయ కరాటే టోర్నమెంట్లో సత్తా చాటిన తెలంగాణ క్రీడాకారులు శుక్రవారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే.చంద్రశేర్రావును కలిసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు. ఈ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారులు రెండు స్వర్ణ పతకాలు, రెండు రజత పతకాలు సాధించడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వీరికి అన్ని విధాలుగా సాయం చేస్తుందని హామీ ఇచ్చారు. స్వర్ణ పతక విజేతలు వివేక్ హర్షిత్రెడ్డి, హర్ష, రజత పతక విజేతలు అబ్రహం థామస్, సామ్యూల్ రతన్, కోచ్ కే.సుధాకర్లు సీఎంను కలిశారు.