తెలంగాణ
పీపీఏల రద్దు నిర్ణయంపై కేంద్ర మంత్రి అసహనం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 9 September 2019
హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం తీసుకున్న పీపీఏల రద్దు నిర్ణయంపై కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలో వీటిలో అవకతవకలు జరిగాయని కాబట్టి వీటిని రద్దు చేయాలని ప్రభుత్వం లేఖలతో కోరుతున్నదని, వీటి రద్దు వల్ల పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన అన్నారు. వంద రోజుల ప్రగతిపై ఆయన ఒక నివేదిక సమర్పించారు. అవకతవకలు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేకుండా పీపీఏలను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం కోరుతున్నట్లు తెలిపారు. ఈ వంద రోజులలో తాము చేసిన అభివృద్ధి పనులే తమకు అధికారాన్ని కట్టబెట్టాయని చెప్పారు. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు.