తెలంగాణ
ఆర్టీసీ ఉద్యోగికి గుండెపోటు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 18 October 2019
చిట్యాల, అక్టోబర్ 17: ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలతో తీవ్ర ఆందోళనకు గురైన నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రానికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి గుండెపోటుతో ఆసుపత్రి పాలయ్యాడు.
పట్టణానికి చెందిన గోసుకొండ మల్లయ్య నల్లగొండ ఆర్టీసీ డిపోలో ఏడీసీగా విధులు నిర్వహిస్తున్నాడు. సమ్మె కారణంగా ఆర్టీసీ ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రచారం జరుగుతుండగా ఆందోళనతో గురువారం తెల్లవారు జామున గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం నార్కట్పల్లి వద్ద గల కామినేని ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో హైద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కోమాలో ఉన్న మల్లయ్య ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు సమీప బంధువులు తెలిపారు.