తెలంగాణ

గిరిజన సంక్షేమ పనులు వేగవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 19: తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్‌హర్ మహేష్ దత్ ఎక్కా అధికారులను ఆదేశించారు. శనివారం ఆ శాఖ ఇంజనీరింగ్ విభాగం ప్రధాన ఇంజనీరు, పర్యవేక్షక, కార్యనిర్వాహక ఇంనీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షాలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో చేపట్టబడిన వివిధ పథకాలతొ మంజూరు కాబడిన వౌలిక సదుపాయాలు, గిరిజన భవనాలు, పోస్టుమెట్రిక్ వసతి గృహలు, గిరిజన యువత శిక్షణా కేంద్రాలు, ఎకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు, గిరిజన గూడాకలకు, తండాలకు రహదారి నిర్మాణ సౌకర్యాలతో పాటు ఇతర పనులకు సంబంధించి డివిజన్‌ల వారీగా సమీక్షించారు. ఈ సమీక్షా సామావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన ఇంజనీర్ ఎన్.శంకర్ రావుతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.