తెలంగాణ
తెలంగాణ భక్తులకు ప్రాధాన్యం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 20 October 2019
హైదరాబాద్, అక్టోబర్ 19: తెలంగాణ రాష్ట్రం నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు శ్రీవారి దర్శనం కోసం సముచిత ప్రాధన్యత కల్పించాలని రాష్ట్ర అటవీ పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారం జూబ్లిహిల్స్లోని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని ఆయన నివాసం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ నుంచి రోజు వేలాది మంది భక్తులు తిరుమలేశుడి దర్శనం కోసం వస్తుంటారని, ఇక్కడి భక్తులకు ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించాలని మంత్రి సుబ్బారెడ్డికి విజ్ఞప్తి చేశారు.