జాతీయ వార్తలు
రామాలయ నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేయాలి: రాందేవ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 17 November 2019
బెంగళూరు, నవంబర్ 16: అయోధ్యలో శ్రీ రామచంద్ర మూర్తి ఆలయం నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయాలని యోగా గురువు బాబా రాందేవ్ అన్నారు. వైదిక సంప్రదాయాలకు రామాలయం అద్దం పడుతుందన్నారు. రాబోయే రోజుల్లో అయోధ్యలోని రామాలయం దేశంలోని అతి పెద్ద పర్యాటక కేంద్రంగా మారుతుందని ఆయన తెలిపారు. వాటికన్, మక్కా, అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్ తరహాలో అయోధ్య కూడా అతి పెద్ద పర్యాటక కేంద్రంగా మారుతుందని రాందేవ్ బాబా శనివారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఉడిపిలో ఐదు రోజుల శిక్షణా కార్యక్రమ నిర్వహణ కోసం రాందేవ్ బాబా చేరుకున్నారు. రామ జన్మభూమి ట్రస్టు ద్వారా అయోధ్యలోని రామాలయం అతి పెద్ద అథ్యాత్మిక కేంద్రంగా మారుతుందని ఆయన ఆకాంక్షించారు.