జాతీయ వార్తలు
నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 3 June 2016
న్యూఢిల్లీ, జూన్ 2: దేశ ప్రజలకు చల్లని కబురు. నైరుతి రుతుపవనాలు మరో నాలుగైదు రోజుల్లో దేశంలోకి ప్రవేశిస్తాయని వాతావరం శాఖ గురువారం ప్రకటించింది. ఈ ఏడాది సగటుకంటే ఎక్కువగానే వర్షపాతం నమోదవుతుందని వారు వెల్లడించారు. సాధారణ నుంచి అతి సాధారణ స్థాయిలో వర్షాలుంటాయని చల్లని కబురు చెప్పారు. సగటు కంటే ఎక్కువగా వర్షాలుపడే అవకాశం 96 శాతం ఉందన్నారు. వాయువ్య భారతంలో 108 శాతం వర్షపాతం నమోదుకావచ్చని వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ లక్ష్మణ్ సింగ్ రాథోడ్ స్పష్టం చేశారు. ఈశాన్య భారత్లో సగటుంటే ఎక్కువగానే వర్షాలుపడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.